సింగపూర్ కూడా ఇండియన్స్కి షాకిస్తోంది !
వీసాల ప్రకంపనలు ఇంకా రేగుతూనే ఉన్నాయి. విదేశాలు ఇండియన్లకి షాకులు ఇస్తూనే ఉన్నాయి.
వీసాల ప్రకంపనలు ఇంకా రేగుతూనే ఉన్నాయి. విదేశాలు ఇండియన్లకి షాకులు ఇస్తూనే ఉన్నాయి. వీసా జారీల్లో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ భారతీయులకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్న అమెరికా బాటలోనే సింగపూర్ నడుస్తోంది. దేశీయ ఐటీ నిపుణులకు ఇచ్చే వీసాలను సింగపూర్ బ్లాక్ చేస్తోంది.
ఎల్ఈడీ టీవీలపై భారీ డిస్కౌంట్లు

సింగపూర్ లో వర్క్ చేసేందుకు ఐటీ నిపుణులు పొందే వీసాలను సింగపూర్ లో భారీగా తగ్గిస్తున్నట్టు తెలిసింది. వాణిజ్యపరమైన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ సమగ్ర ఆర్థిక సహకార ఒప్పంద(సీఈసీఏ) సమీక్షను పక్కనపెడుతోంది. ప్రతిభావంతులైన స్థానికులను భారత కంపెనీలు నియమించుకోవాలంటూ అమెరికా మాదిరి ఆదేశాలు జారీచేస్తోంది.
జియో సమ్మర్ సర్ప్రైజ్, 100 జిబి ఉచిత డేటా, కొత్త ప్లాన్స్ ఇవే !

ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, ఎల్ అండ్ టీ, ఇన్ఫోటెక్, హెచ్సీఎల్ , టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీలు అక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ ఆ కంపెనీలకు ఈ ఏడాది ప్రారంభం నుంచి వీసా సమస్యలు ప్రారంభమయ్యాయి.
వీసా జారీలు పడిపోతున్నాయి. స్థానికులను నియమించుకోవాంటూ దేశీయ కంపెనీలకు ఆదేశాలు వస్తున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖరన్ చెప్పారు.ప్రాక్టికల్ గా మన ఐటీ నిపుణులకు వీసాలను కూడా ఆపివేస్తున్నట్టు మరో ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ కూడా పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications