జియో ఉచితాన్ని ఎందుకు పొడిగించారు, వివరణ కోరిన ట్రాయ్
ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న జియోకు ట్రాయ్ రూపంలో చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి.
ఉచిత ఆఫర్లతో దూసుకుపోతున్న జియోకు ట్రాయ్ రూపంలో చిక్కులు ఎదురయ్యేలా ఉన్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా ఉచిత వాయిస్, డేటా ప్రమోషనల్ ఆఫర్ పొడిగింపు విషయమై రిలయన్స్ జియోని వివరణ కోరింది.
స్పెసిఫికేషన్ పరంగా ఈ ఏడాది బెస్ట్ స్మార్ట్ఫోన్లు

నిబంధనల ప్రకారం ప్రమోషనల్ ఆఫర్స్ 90 రోజులు వరకు మాత్రమే ఉండాలి. మరి ఆఫర్ పొడిగింపు నిర్ణయం నిబంధనలకు ఏవిధంగా విరుద్ధం కాదో తెలియజేయాలని ట్రాయ్ తన లేఖలో పేర్కొంది. అయితే ట్రాయ్ లేఖపై ఇంకా జియో స్పందిచలేదు. అయితే ట్రాయ్ లేఖ ఆధారంగా చూస్తే .. జియోకి డిసెంబర్ 18 నాటికి 6.3 కోట్ల మంది యూజర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
నమ్మగలరా..ఇండియాలో 95 కోట్ల మందికి ఇంటర్నెట్ తెలియదు !

జియో వెల్కమ్ ఆఫర్కి, న్యూ ఇయర్ ఆఫర్ ఒకే తరహావి కాదని, రెండింటి మధ్య వ్యత్యాసముందని జియో .. ట్రాయ్కు తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ట్రాయ్ వచ్చే మార్చి 31 కి నెలవారీగా ఎంత మంది యూజర్లు జతవుతారో ముందుగానే తెలియజేయాలని జియోని కోరినట్లు తెలుస్తోంది.
6జిబి ర్యామ్ ఫోన్, స్టార్టింగ్ ధర రూ. 11999 మాత్రమే

కాగా జియో ఆఫర్ పొడిగింపును ట్రాయ్ అంగీకరించడాన్ని సవాల్ చేస్తూ ఎయిర్టెల్ ఇటీవలే టెలికం ట్రిబ్యునల్ను ఆశ్రయించడం తెలిసిందే.


Click it and Unblock the Notifications








