JioFiber కాంబో ప్లాన్!!! 1TB వరకు డేటా ప్రయోజనం...
బ్రాడ్బ్యాండ్ పరిశ్రమలో యాడ్-ఆన్ ప్లాన్ ల కారణంగా తనకంటూ బ్రాండ్ నేమ్ను రూపొందించడంలో జియోఫైబర్ విఫలమైంది. ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ జియో వినియోగదారులకు సరసమైన మరియు వినూత్నమైన సమర్పణలను ఎప్పటికప్పుడు అందించడానికి ప్రసిద్ది చెందింది.

జియోఫోన్ యొక్క వినియోగదారులకు తన 4G ప్లాన్ లను సరసమైన ధరలకు అందిస్తున్నప్పటికి బ్రాడ్బ్యాండ్ రంగంలో మాత్రం కాస్త వెనుకబడింది. జియో ఫైబర్తో కంపెనీ ప్రజలను ఆకర్షించడంలో విఫలమైంది. 100Mbps ప్లాన్ను కేవలం రూ.699 కు అందించే బ్రాడ్బ్యాండ్ ఆపరేటర్లలో జియోఫైబర్ ఉన్నారనడంలో సందేహం లేదు. కానీ ప్లాన్లపై ఎఫ్యుపి పరిమితి ఉండడం అనేది వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడని విషయం.

లాక్డౌన్ కారణంగా జియోఫైబర్ ఇప్పుడు తన అన్ని బ్రాడ్బ్యాండ్ ప్లాన్లపై డబుల్ డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. రూ.199 ధర గల జియోఫైబర్ కాంబో ప్లాన్ ఇప్పుడు 1TB డేటాను ఏడు రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. రిలయన్స్ జియో ఈ ప్లాన్ ను కాంబో ప్లాన్గా మార్కెటింగ్ చేస్తోంది. అయితే ఇది వినియోగదారులకు అందించే డేటా ప్రయోజనం కారణంగా యాడ్-ఆన్ యొక్క ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది.

జియోఫైబర్ కాంబో ప్లాన్
రూ.199 (GST మినహా) ధర గల జియోఫైబర్ కాంబో ప్లాన్ ఇప్పుడు వినియోగదారులకు GSTతో కలుపుకొని ఈ ప్లాన్ రూ.234.82 ధర వద్ద లభిస్తుంది. ఇది 100Mbps వేగంతో 1TB లేదా 1000GB డేటాను ఒక వారం చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ డేటా పరిమితి తర్వాత దాని యొక్క వేగం 1Mbps కు తగ్గించబడుతుంది. వినియోగదారులు 1 Mbps వేగంతో అపరిమిత డేటా ప్రయోజనాన్ని మరియు JioFiber యొక్క ల్యాండ్లైన్ సేవతో అపరిమిత వాయిస్ కాలింగ్ను కూడా పొందుతారు.

జియోఫైబర్ రూ.199 కాంబో ప్లాన్
జియోఫైబర్ యొక్క రూ.199 కాంబో ప్లాన్ను ఇతర జియోఫైబర్ ప్లాన్ పైన కూడా ఉపయోగించవచ్చు. ఇది ఇప్పటికే ఉన్న జియోఫైబర్ కస్టమర్లు స్వతంత్ర ప్రణాళికగా కూడా ఎంచుకోవచ్చు. ఒక కస్టమర్ ఒకే కాంబో ప్లాన్ను ఒక నెల పాటు ఎంచుకుంటే రూ.1,100 ధరతో మొత్తంగా 4.5TB డేటా ప్రయోజనంను అందిస్తాయి. 200GB డేటాను 100Mbps వేగంతో అందించే జియోఫైబర్ యొక్క రూ.699 బ్రాడ్బ్యాండ్ ప్లాన్ కంటే జియోఫైబర్ యొక్క ఈ కాంబో ప్లాన్ ఒక నెల చెల్లుబాటు కాలానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

రిలయన్స్ జియో జియోఫైబర్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ
ప్రస్తుత లాక్డౌన్ వ్యవధిలో పెరిగిన డేటా వినియోగానికి మద్దతుగా రిలయన్స్ జియో ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలో జియోఫైబర్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని పెంచుతున్నట్లు చెబుతున్నారు. కస్టమర్లు ఎటువంటి అంతరాయాలను ఎదుర్కోకుండా ఉండటానికి జియో సంస్థ రాజధాని నగరంలో తన కనెక్టివిటీని పెంచుతోందని నిఘా వర్గాలు తెలిపాయి. లాక్డౌన్ ఏప్రిల్ 30 వరకు పొడిగించినందున జియోఫైబర్ యొక్క మొత్తం చందాదారుల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్
రిలయన్స్ జియో ఇప్పుడు అన్ని ప్లాన్లపై డబుల్ డేటా ప్రయోజనాన్ని అందించడం ప్రారంభించింది. బేసిక్ 10 ఎమ్బిపిఎస్ ప్లాన్ను అదనపు ఖర్చు లేకుండా వినియోగదారులందరికీ అందిస్తున్నది. JioFiber చందాదారుల సంఖ్య 2019 చివరినాటికి 0.86 మిలియన్లుగా ఉంది. భారతదేశంలో లాక్డౌన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) కు సహాయం చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








