ఈ టీవీని కొన్నవారికి Airtel Digital TV HD కనెక్షన్ ఉచితం
ఇండియాలోని మూడవ అతిపెద్ద పే డిటిహెచ్ ఆపరేటర్ ఎయిర్టెల్ డిజిటల్ టివి యొక్క డిటిహెచ్ ఆర్మ్ ఇటీవలే షియోమి, శామ్సంగ్ మరియు ఎల్జి వంటి స్మార్ట్ టివి బ్రాండ్లతో కలిసి తన ఎక్స్స్ట్రీమ్ బాక్స్ను తక్కువ ధరకు అందిస్తున్నది.

ఇప్పుడు ఎయిర్టెల్ డిజిటల్ టివి (Detel)డిటెల్ ఇండియాతో కూడా జతకట్టింది. డిటిఎల్ ను వియోగిస్తున్న వారు ఎయిర్టెల్ డిజిటల్ టివి హెచ్డి కనెక్షన్ను కొనుగోలు చేయడానికి వినియోగదారులకు 12 నెలల సభ్యత్వాన్ని అందిస్తుంది. ఈ ఆఫర్ కింద డిటెల్ టీవీ యూజర్లు ఎయిర్టెల్ డిటిహెచ్ HD కనెక్షన్ను కేవలం 1,999 రూపాయల ధర వద్ద పొందవచ్చు.

ఇది వారికి డిటెల్ అన్లిమిటెడ్ ధమాకా ప్యాక్ యొక్క 360 రోజుల సభ్యత్వాన్ని అందిస్తుంది. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులకు రిమోట్, అడాప్టర్, 10m వైర్ మరియు యాక్టివేషన్ ఖర్చులను కూడా ఉచితంగా అందిస్తుంది.

ఆఫర్ను ఎలా పొందాలి?
వినియోగదారులు రెండు విధాలుగా ఈ ఆఫర్ను పొందవచ్చు. ఇందులో మొదటిది రాయితీ ఆఫర్ను ఆస్వాదించడానికి డిటెల్ ఎల్ఈడీ టీవీ వినియోగదారులు ఎయిర్టెల్ డిటిహెచ్ నంబర్ 84482-84767 కు కాల్ చేసి కనెక్షన్ కోసం అభ్యర్థించాలి. ఎయిర్టెల్ డిటిహెచ్ అధికారులు డిటెల్ టివిలో పేర్కొన్న సీరియల్ నంబర్ను ధృవీకరించిన తర్వాత వినియోగదారులు వారు అందించే డిస్కౌంట్కు అర్హులు అవుతారు.

రెండవ రాయితీ ఆఫర్
రెండవ రాయితీ ఆఫర్లలో భాగంగా కస్టమర్లు 84482-84767 కు SMS పంపడం ద్వారా ఆఫర్ ను పొందవచ్చు. డిటెల్ టీవీ యజమానులు తమ మొబైల్ నంబర్, టీవీ యొక్క టీవీ సీరియల్ నంబర్తో పాటు కస్టమర్ పిన్ కోడ్ను SMS లో పంపాలి. ఆఫర్లో చేర్చబడిన డిటెల్ అన్లిమిటెడ్ ధమకా ప్యాక్ 360 రోజులు ఉచితంగా ఉంటుందని వినియోగదారులు గమనించాలి. ఉచిత ప్యాక్ గడువు ముగిసిన తర్వాత వినియోగదారులు ఆరు నెలలకు 799 రూపాయలు మరియు 12 నెలల ప్యాకేజీకి 1,349 రూపాయలు చెల్లించి రీఛార్జ్ చేసుకోవచ్చు.

భారతదేశంలో ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లు
ప్రస్తుతం భారతదేశంలో టాటా స్కై, డిష్ టివి, సన్ డైరెక్ట్ మరియు ఎయిర్టెల్ డిజిటల్ టివి అనే నాలుగు ప్రధాన డిటిహెచ్ ఆపరేటర్లు ఉన్నారు. ఇండియాలో ఇప్పుడు 16.3 మిలియన్ల మంది చందాదారులతో ఎయిర్టెల్ డిజిటల్ టివి మూడవ స్థానంలో ఉంది. టాటా స్కై అత్యధికంగా చార్టులో అందరి కంటే ముందుంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ వివిధ స్మార్ట్ టీవీ బ్రాండ్లతో కలిసి ఎక్స్స్ట్రీమ్ బాక్స్ను తక్కువ ధరకు అందించింది. ఏదేమైనా కొత్త టారిఫ్ క్రమంలో ట్రాయ్ రూపొందించిన కొత్త నిబంధనల కారణంగా ఈ ఆపరేటర్ ఈ మాసంలో కేవలం లక్ష మంది కొత్త వినియోగదారులను చేర్చుకున్నది.

ట్రాయ్ NTO 2.0
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) NTO 1.0 కు చాలా సవరణలు చేసిన తరువాత NTO 2.0ను అమలు చేసింది. సవరణలు ప్రకటించినప్పటి నుండి ప్రసారకులు NTO1.0 నుండి ఇంకా కోలుకోనందున ఉపశమనం కోరుతూ రెగ్యులేటర్తో పోరాడుతున్నారు. ప్రసారకులు మరియు ట్రాయ్ల మధ్య సమస్య కొనసాగుతుండగా డిటిహెచ్ ఆపరేటర్లు కొత్త NTO 2.0 మార్పులను టాటా స్కై మరియు ఎయిర్టెల్ డిజిటల్ టివి ఆపరేటర్లు మొదటగా అమలు చేయడం ప్రారంభించారు.

200 FTA ఛానెల్ల కొత్త ధరలు
ట్రాయ్కు అవసరమైన మార్పుల ఆధారంగా డిటిహెచ్ ఆపరేటర్లు మార్పులు చేస్తున్నారు. పరిశ్రమలో కొత్త మార్పులలో భాగంగా ఎయిర్టెల్ డిజిటల్ టివి మరియు టాటా స్కై 200 FTA ఛానెల్లకు NCF గా రూ.153.4లను వసూలు చేస్తున్నాయి. NTO1.0 సమయంలో అందించిన 100 ఛానెల్లకు బదులుగా ఇప్పుడు 200 కంటే ఎక్కువ SD ఛానెళ్లను రూ.188.80 ధర వద్ద అందిస్తున్నారు.

మల్టీ టీవీ NCF కొత్త ధరలు
డిటిహెచ్ ఆపరేటర్లు ప్రతి ఒక్కరు మల్టీ టివి ఎన్సిఎఫ్ ఛార్జీలను తగ్గించారు. సెకండరీ కనెక్షన్ కోసం ఏ ఆపరేటర్ అయినా 40% కంటే ఎక్కువ ఎన్సిఎఫ్ను వసూలు చేయరాదని ట్రాయ్ NTO 2.0 లో కండిషన్ పెట్టింది. అందువల్ల మల్టీ టివి చందాదారుల కోసం రెండు స్థిర ఎన్సిఎఫ్ ఛార్జీలు ఉంటాయని ట్రాయ్ పేర్కొన్నారు. ఒకే ఇంటిలో ఒకే అకౌంట్ తో యాక్టివేట్ అయిన మల్టీ టీవీ కనెక్షన్ల కోసం 200SD ఛానెళ్లకు రూ.52 (పన్నులతో సహా రూ .61.36) నెట్వర్క్ కెపాసిటీ ఫీజు వర్తిస్తుంది.


Click it and Unblock the Notifications








