డేటా వినియోగంలో జియోను అధిగమించిన ఎయిర్టెల్
టెలికాం రంగంలో దిగ్గజాలు ప్రస్తుతం ఇండియా మార్కెట్లో ఒకరిపై ఒకరు తీవ్ర పోటీలో ఉన్నారు. వినియోగదారులను ఆకర్శించడానికి దాదాపు రెండు సంవత్సరాలు ప్రయత్నం చేసిన తరువాత కంపెనీలు తమ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని చూడటం ప్రారంభించాయి .

ఎటువంటి రంగంలో అయిన తీవ్రమైన పోటీ తర్వాత పరిశ్రమ కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. రికవరీకి ప్రధాన కారణాలలో ఇది కూడా ఒకటి. గత సంవత్సరంలో డేటా సుంకాలలో అన్ని కంపెనీలు స్థిరంగా ఉన్నాయి అని నివేదిక పేర్కొంది.

ప్రతి వినియోగదారుని నెలవారీ డేటా వినియోగ విషయంలో భారతి ఎయిర్టెల్ రిలయన్స్ జియోను అధిగమించినట్లు తెలుస్తోంది.

ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ నివేదిక టెలికాం రంగం యొక్క సమగ్ర చిత్రాన్ని చిత్రించడానికి వేర్వేరు గణాంకాలను పంచుకుంది. నెలవారీ డేటా వినియోగ విషయానికి వస్తే భారతి ఎయిర్టెల్ వినియోగదారులు నెలకు 11 జీబీ డేటాను వినియోగిస్తున్నట్లు సమాచారం . పెరుగుతున్న రేట్లతో డేటా వాడకంలో ఈ పెరుగుదల ఎయిర్టెల్ కోలుకోవడం సులభతరం చేస్తుంది. గణాంకాల ప్రకారం 2.5 సంవత్సరాలకు పైగా స్థిరమైన రూపం తరువాత డేటా వినియోగం 11 నుండి 17 శాతం మధ్య పెరిగింది. డేటా టారిఫ్ను చూస్తే జియో దీనికి పోటీగా సుమారు 25-30 శాతం తగ్గింపుతో డేటాను అందిస్తూనే ఉంది. ఈ డిస్కౌంట్ రిలయన్స్ జియో దూకుడుగా మార్కెట్ వాటాను కొనసాగించడానికి సహాయపడింది.

ఎయిర్టెల్ ఆదాయంపై ఎక్కువ దృష్టి సారించింది:
భారతి ఎయిర్టెల్ నుండి ఇటీవల అనేక మార్పులు వచ్చాయి. దీనిని బట్టి ఎయిర్టెల్ నిజంగా చందాదారుల సంఖ్యను చూడటం లేదని సూచిస్తున్నాయి. మార్కెట్ వాటాపై దృష్టి పెట్టడానికి బదులుగా ఎయిర్టెల్ వినియోగదారుడి సగటు ఆదాయాన్ని (అవరేజ్ రెవెన్యూ పర్ యూజర్) (ARPU) పెంచడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి వోడాఫోన్ ఐడియాతో సహా ఇతర టెలికాం ప్లేయర్లు కూడా వారి రేట్లు పెంచడం ద్వారా ఎయిర్టెల్ కూడా తన రేట్లను పెంచింది.ఏదేమైనా ఈ ఆదాయం మరియు లాభదాయకత పెరుగుదల నిజంగా ప్రాధమిక సమస్యలను పరిష్కరించదని నివేదిక పేర్కొంది. ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ కూడా అధిక పరపతి మరియు నెగటివ్ ఫ్రీ క్యాష్ వంటి సమస్యలను కూడా హైలైట్ చేసింది.


Click it and Unblock the Notifications








