90 రోజుల పాటు జియో ఉచిత ఆఫర్
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో మరోసారి పంజా విసిరింది.
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న జియో మరోసారి పంజా విసిరింది.దిగ్గజాలకు సవాల్ విసురుతూ న్యూ స్కీం పేరుతో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో మరో కొత్త ప్లాన్ను లాంచ్ చేసింది. 799 రూపాయల ధరతో ఈ ప్రీపెయిడ్ ప్యాక్ను జియో కస్టమర్లకు అందబాటులోకి తెచ్చింది.ఈ ప్లాన్లో భాగంగా యూజర్లకు రోజుకు 6.5జీబీ డేటాను అందిస్తోంది. రూ. 799 ప్రీపెయిడ్ ప్లాన్పై జియో యూజర్లు 182 జీబీ హై-స్పీడ్ 4జీడేటాను పొందవచ్చని జియో విడుదల చేసిన ఒక ప్రకటన లో వెల్లడించింది.

అదనపు డేటా ప్రయోజనాలను..
కంపెనీ అందించిన సమాచారం ప్రకారం రూ. 799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్పై అదనపు డేటా ప్రయోజనాలను అదిస్తున్నది.

రోజుకు 6.5జీబీ హై-స్పీడ్ 4 జి డేటా
28 రోజులు వాలిడిటీతో రోజుకు 6.5జీబీ హై-స్పీడ్ 4 జి డేటా ఉచితం. ఇంకా అన్లిమిటెడ్ కాల్స్, 100ఎస్ఎంఎస్లు ఉచితం. జూన్ 30వరకు ఈ ప్లాన్ రీచార్జ్కు అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది.

100 డిస్కౌంట్
అలాగే 300 రూపాయలు, ఆపైన రీచార్జ్లపై 100 డిస్కౌంట్ను, రూ.300లోపు రీచార్జ్లపై 20శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది.

రూ. 799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్
కాగా రూ. 799 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వాస్తవంగా 28 రోజుల వ్యవధిలో రోజుకు 5జీబీ డేటా చొప్పున 140జీబీ డేటాను అందిస్తుంది. తాజా రివ్యూ అనంతరం రోజుకు 1.5 జీబీ డేటా అదనంగా ఆఫర్ చేస్తోందన్నమాట.

రూ.149, రూ.349, రూ. 399, రూ. 449 తదిర రీచార్జ్ప్లాన్లపై
కాగా రూ.149, రూ.349, రూ. 399, రూ. 449 తదిర రీచార్జ్ప్లాన్లపై రోజుకు వాస్తవంగా అందిస్తున్న 4 జీజీ డేటా ఆఫర్ను పెంచిన సంగతి తెలిసిందే.

రూ.299 ప్లాన్లో
ఇప్పటికే ప్రకటించిన రూ.299 ప్లాన్లో అదనంగా 1.5 జీబీల డేటాను అందిస్తున్నది. కాగా గతంలో రోజుకు 3జీబీల డేటా అందిస్తుండేది. ఫిఫా వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని డేటా పరిధిని మరింత పెంచినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

రూ.149, రూ.399 ప్యాక్లపై
ఈ డేటాతోపాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్(లోకల్, ఎస్టీడీ, రోమింగ్), ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చును. డబుల్ ధమాకా పేరుతో సంస్థ ఇటీవల ప్రకటించిన రూ.149, రూ.399 ప్యాక్లపై రోజుకు 3జీబీల డేటాను అందిస్తున్నది. వీటిలో రూ.299ని అప్గ్రేడ్ చేసింది.


Click it and Unblock the Notifications








