Just In
- 44 min ago OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- 2 hrs ago వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- 3 hrs ago యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 3 hrs ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
Don't Miss
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Movies విడాకులు దిశగా మరో స్టార్ కపుల్.. ఇండస్ట్రీలో షాకింగ్గా..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రాబడే టార్గెట్, టారిఫ్ ధరలు భారీగా పెరిగే అవకాశం
దేశీయ టెలికాం రంగంలో మున్ముందు చార్జీలు మరింత పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. జెఫ్రీస్ అనే అంతర్జాతీయ సేవల సంస్థ తాజా నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. భారత టెలికాం కంపెనీల ఆదాయం/ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆర్జన (ఏఆర్పీయూ) 2020-25 ఆర్థిక సంవత్సరాల్లో రెట్టింపు కావచ్చని రిపోర్టు అంచనా వేసింది. 2024-25 నాటికి మొబైల్ సేవల ఆదాయం 3,800 కోట్ల డాలర్లకు చేరుకోవచ్చంటోంది. ఇది మన కరెన్సీలో రూ.2.85 లక్షల కోట్లతో సమానం. ప్రస్తుతం దేశీయ టెలికాం రంగంలో కొనసాగుతున్న ఏకీకరణ ప్రక్రియ, చార్జీల పెంపుతో అత్యధికంగా లబ్ధి పొందనున్న కంపెనీ భారతీ ఎయిర్టెల్ అని జెఫ్రీస్ పేర్కొంది.
భారతీ ఎయిర్టెల్
ప్రస్తుతం భారత మొబైల్ సేవల ఆదాయం-జీడీపీ నిష్పత్తి 0.7 శాతంగా ఉంది. పలు వర్ధమాన దేశాలతో పోలిస్తే ఇది చాలా తక్కువని నివేదిక పేర్కొంది. కంపెనీలిప్పుడు చార్జీల విషయంలో ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేస్తుండటంతో రాబడి ఏటా 3-5 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉందని జెఫ్రీస్ అంచనా వేసింది.
ఆర్థికంగా ఒత్తిడి
రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో మొబైల్ కాలింగ్, డేటా సేవలు అంత్యంత చౌకగా మారాయి. జియోకు పోటీగా ఇతర టెలికాం కంపెనీలూ చార్జీలను భారీగా తగ్గించాల్సి వచ్చింది. తత్ఫలితంగా టెలికాం రంగంపై ఆర్థికంగా ఒత్తిడి పెరిగి, విలీనాలకు దారితీసింది. ఇప్పుడిక పోటీ మూడు ప్రైవేట్ కంపెనీల మధ్యనే. అయితే, సుప్రీంకోర్టు తీర్పుతో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాపై ఏజీఆర్ (సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం) బకాయిలపై ప్రభావం పడింది. దాంతో ఈ రెండు కంపెనీలపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగింది.
మూడేళ్లలోనే నెం.1 టెలికాం
వ్యాపార మనుగడ కోసం ఆదాయం పెంచుకోవడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపేమో, రిలయన్స్ జియో సేవలు ప్రారంభించిన మూడేళ్లలోనే నెం.1 టెలికాం కంపెనీగా ఎదిగింది. ఈ ఏడాది జనవరి నాటికి కంపెనీ మార్కెట్ వాటా 32 శాతానికి పైగా పెరిగింది.
చార్జీలు పెరిగినప్పటికీ,
కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీకిక కారు చౌక సేవల అవసరం లేకుండా పోయింది. ఈ పరిణామం టెలికాం రంగంలో ధరల యుద్ధానికి తెరదించిందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. గత ఏడాది డిసెంబరులో మొబైల్ టారిఫ్లు గణనీయంగా పెరిగాయి. చార్జీలు పెరిగినప్పటికీ, ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఎయిర్టెల్, జియో మొబైల్ వినియోగదారులు మరో 2.4 కోట్ల మంది పెరిగారు. దీన్నిబట్టి చూస్తే, చార్జీల పెంపునకు మార్కెట్ ఆమోదం లభించినట్లేనని జెఫ్రీస్ రిపోర్టు పేర్కొంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470