సోషల్ మీడియాలో సెలిబ్రిటీ ఛాలెంజ్ వైరల్
లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం ఆయన చాలా మంది సెలిబ్రిటీలు ఈ సమయంలో వారు మరొకరికి రక రకాల ఛాలెంజులు ఇస్తున్నారు. ఇందులో అందరి కంటే ముందు ఉన్నది RX100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్.

ఈమె ఇప్పటికే రెండు ఛాలెంజులు పూర్తి చేసింది. మొదటిది పిల్లోతో కెమెరాకు పోజులు ఇవ్వగా మరొకటి న్యూస్ పేపర్ డ్రెస్ తో ఉన్న ఫోటోలను విడుదల చేసి అందరికి ఛాలంజ్ చేసింది.

మరొక పక్క దర్శక ధీరుడు రాజమౌళి
మరొక పక్క దర్శక ధీరుడు రాజమౌళి తన ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసిన వీడియోను విడుదల చేసి చివరిగా జూనియర్ NTR కు ఛాలంజ్ చేసారు. దానికి బదులుగా ఎన్టీఆర్ కూడా తన ఇంటి ప్రాంగణం మొత్తాన్ని శుభ్రం చేసిన వీడియోను విడుదల చేసారు.

కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 80 కొత్త కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త కేసులతో కలుపుకుని ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 893కు చేరింది. వీరిలో 141 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 725గా ఉంది. కరోనా కారణంగా ఏపీలో ఇప్పటివరకు 27 మంది చనిపోయారు. కొత్త నమోదైన కేసుల్లో కర్నూలు 31, అనంతపురం 6, చిత్తూరు 14, తూర్పు గోదావరి 6, గుంటూరు 18, కృష్ణా 2, ప్రకాశం 2, విశాఖపట్నంలో ఒక కేసు ఉన్నాయి.

ప్రాంతాల వారిగా కరోనా కేసులు
ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 223 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అనంతపురంలో 32, చిత్తూరు 62, తూర్పు గోదావరి 24, గుంటూరు 164, కడప 23, కృష్ణా 56, నెల్లూరు 60, ప్రకాశం 48, విశాఖపట్నం 3, పశ్చిమ గోదావరి జిల్లాలో 30 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదు.


Click it and Unblock the Notifications








