వివో నుంచి 3జిబి ర్యామ్ ఫోన్ రిలీజయింది
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వీవో మరో కొత్త ఫోన్ని విడుదల చేసింది. వివో వై55ఎస్ పేరుతో 3జిబి ర్యామ్ అలాగే 16 జిబి ఇంటర్నెల్ మెమొరీతో ఫోన్ ను రిలీజ్ చేసింది.
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వీవో మరో కొత్త ఫోన్ని విడుదల చేసింది. వివో వై55ఎస్ పేరుతో 3జిబి ర్యామ్ అలాగే 16 జిబి ఇంటర్నెల్ మెమొరీతో ఫోన్ ను రిలీజ్ చేసింది. క్రౌన్ గోల్డ్, స్పేస్ గ్రే కలర్స్ లో వస్తున్న ఈ ఫోన్ 26 నుంచి అని ప్రధాన షోరూంల్లో లభిస్తుందనకి కంపెనీ తెలిపింది. అయితే ఈ ఫోన్ వివో గతేడాది రిలీజ్ చేసిన Y55Lకి అప్ గ్రేడెడ్ వర్షన్ అని కంపెనీ తెలిపింది. 13 ఎంపీ మెగా ఫిక్సల్ కెమెరాతో వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ రూ.12,490గా నిర్ణయించింది. ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.
ఫేస్బుక్ నుంచి డబ్బులు సంపాదించండి

డిస్ ప్లే
5. 2 ఇంచ్ 2.5డి కర్వడ్ స్క్రీన్ తో పాటు హెచ్ డి డిస్ ప్లే తో మొబైల్ వచ్చింది. రిజల్యూషన్ విషయానికొస్తే 1280x720 pixel. స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్ మీద మొబైల్ ఆపరేట్ అవుతుంది.

ర్యామ్
3జిబి ర్యామ్ తో పాటు 16 జిబి ఇంటర్నల్ మెమొరీ అలాగే మైక్రో ఎస్ డీ ద్వారా 256 జిబి వరకు విస్తరించుకునే సామర్ధ్యాన్ని ఈ ఫోన్ కలిగిఉంది.

కెమెరా
కెమెరా విషయానికొస్తే 13 మెగా ఫిక్సల్ తో నచ్చినవిధంగా ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ అభిమానుల కోసం 5 మెగా ఫిక్సల్ కెమెరాను పొందుపరిచారు.

బ్యాటరీ
బ్యాటరీ విషయానికొస్తే 2730 ఎంఏహెచ్ బ్యాటరీ. ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్ సొంతం. ఆండ్రాయిడ్ మార్ష్ మల్లోతో పాటు Funtouch OS 3.0 కూడా ఉంది. 4జీ ఎల్ టీఈ కనెక్టివిటీ సపోర్ట్ .

ధర
ఈ ఫోన్ రూ. 12,490కి అన్ని ప్రధాన షో రూంల్లో అలాగే వివో షో రూంలో లభిస్తుంది. కంపెనీ గతేడాది రిలీజ్ చేసిన Y55Lకి అప్ గ్రేడెడ్ వర్షన్ గా ఈ ఫోన్ ని తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications








