జియో ఫీచర్ ఫోన్ రూ.1500 డిపాజిట్ వెనుక అసలు కథ ?
జియో ఫీచర్ ఫోన్ సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ ఫోన్ కోసం ఇప్పటికే చాలామంది ఎదురుచూస్తున్నారు కూడా.
జియో ఫీచర్ ఫోన్ సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ ఫోన్ కోసం ఇప్పటికే చాలామంది ఎదురుచూస్తున్నారు కూడా. అయితే అది సొంతం చేసుకోవాలంటే రూ.1500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది మూడేళ్ల తరువాత రీఫండ్ చేస్తామని కంపెనీ చెబుతోంది. అయితే దాని వెనుక ఉన్న అసలు కథేంటో ఓ సారి చూద్దాం.

90 రోజులకు ఒకసారి
రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ కట్టి ఫోన్ కొన్నాక కనీసం 90 రోజులకు ఒకసారి అందులో వాడే సిమ్లను రీచార్జి చేయించుకోవాలి.

3 ఏళ్ల తరువాత
అలా చేస్తేనే ఆ ఫోన్కు గాను 3 ఏళ్ల తరువాత సెక్యూరిటీ డిపాజిట్ను తిరిగి ఇస్తారు. లేదంటే ఇవ్వరు.

500 ఎంబీ డేటా
ఇక జియో 4జీ ఫీచర్ ఫోన్ను కొని అందులో వాడే సిమ్ను రీచార్జి చేసుకున్నాక రోజుకు 500 ఎంబీ డేటా లభిస్తుందని చెప్పారు.

ఒక యూజర్కు
అయితే ఒక యూజర్కు నిజంగా రోజుకు 500 ఎంబీ డేటా సరిపోతుందా..? అంటే చెప్పలేం.

లిమిట్ మాత్రం 500 ఎంబీ మాత్రమే
కానీ లిమిట్ మాత్రం 500 ఎంబీ మాత్రమే ఉంటుందని జియో చెబుతోంది. మరది ఎంత మందికి సరిపోతుందో చూడాలి.


Click it and Unblock the Notifications








