మరిన్ని కొత్త సంచలన టారిఫ్ ప్లాన్లతో వస్తున్న జియో !
సంచలన ఆఫర్లతో దూసుకుపోతున్న జియో నేటి నుంచే ముందస్తుగా తాను ప్రకటించిన టారిఫ్ ప్లాన్స్ ను ప్రారంభించబోతుంది.
సంచలన ఆఫర్లతో దూసుకుపోతున్న జియో నేటి నుంచే ముందస్తుగా తాను ప్రకటించిన టారిఫ్ ప్లాన్స్ ను ప్రారంభించబోతుంది. ఆరునెలల పాటు ఉచిత సేవలు అందించిన జియో దానికి స్వస్తీ చెప్పేసింది. అయితే ఈ క్రమంలో అసలు ఎంతమంది జియో సిమ్ ను వాడతారు? ఎంతమంది జియో నుంచి బయటికి వచ్చేస్తారు? అనేది ప్రస్తుతం మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. కష్టమర్లను ఎలాగైనా నిలబెట్టుకునేందుకు జియో కొత్త సంచలన టారిఫ్ ప్లాన్స్ ముందుకు రానుందని తెలుస్తోంది.

వినియోగదారుల బిహేవియర్ ని బట్టి
ఏప్రిల్ 1 నుంచి అమలు చేయబోతున్న టారిఫ్ ప్లాన్స్ అనంతరం వినియోగదారుల బిహేవియర్ ని బట్టి రెండు, మూడు రోజుల్లోనే మరో కొత్త సంచలన టారిఫ్ ప్లాన్స్ ను రిలయన్స్ జియో ప్రకటించనుందని బిజినెస్ ఇన్సైడర్ రిపోర్టు చేసింది.

ఏప్రిల్ 1 నుంచి మూడు కీ అంశాలతో
బిజినెస్ ఇన్ సైడర్ రిపోర్టు ప్రకారం ఏప్రిల్ 1 నుంచి మూడు కీ అంశాలతో కన్జ్యూమర్ బిహేవియర్ పై కంపెనీ అధ్యయనం చేయనుంది.

సంచలనమైన కొత్త టారిఫ్ ప్లాన్లను
వాటిలో ఒకటి జియో ప్రైమ్ యూజర్లు మినహా ఎంతమంది టారిఫ్ ప్లాన్లను ఉపయోగించుకుంటున్నారు.
రెండోది ఎంతమంది వినియోగదారులు తమ కనెక్షన్ తీసుకుంటున్నారు?
మూడోది ఎంతమంది జియో సిమ్ ను వాడటం ఆపివేస్తున్నారు? ఈ అంశాలను బట్టి సంచలనమైన కొత్త టారిఫ్ ప్లాన్లను కంపెనీ ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.

ఈ కొత్త ప్లాన్స్ కూడా
ఈ కొత్త ప్లాన్స్ కూడా వచ్చే రెండు, మూడు రోజుల్లోనే ప్రారంభిస్తుందని రిపోర్టు పేర్కొంది. హ్యాపీ న్యూఇయర్ నిన్నటితో ముగిసిపోయిన నేపథ్యంలో ఇదే సేవలను మరో ఏడాదంతా వినియోగించుకోవడానికి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ ను జియో తీసుకొచ్చింది.

10 కోట్ల మంది సబ్స్క్రైబర్లలో 5 కోట్ల మంది
జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కు నిన్నటితో గడువు ముగిసింది. తాజా లెక్కల ప్రకారం జియోకు ఉన్న 10 కోట్ల మంది సబ్స్క్రైబర్లలో 5 కోట్ల మంది ఇప్పటికే ఈ ప్రైమ్ ఆఫర్ కోసం రూ.99 చెల్లించారు.


Click it and Unblock the Notifications








