జియోకి సవాల్..రోజుకు 2జిబి డేటా
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటిఎన్ఎల్ ఇప్పుడు జియోతో, మిగతా టెల్కోలతో పోటీకి సై అంటోంది.
ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటిఎన్ఎల్ ఇప్పుడు జియోతో, మిగతా టెల్కోలతో పోటీకి సై అంటోంది. తాజాగా ఎంటీఎన్ఎల్ 31 వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ దేశీయ టెలికాం దిగ్గజాల కంటే చవక ధరలో డేటా సేవలను అందించనుంది.
TTD స్పెషల్ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా..?

ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే కొత్త ప్లాన్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది. ఎంటిఎన్ఎల్ వినియోగదారుల కోసం 28 రోజుల వాటిడిటీతో రూ.319ల రీచార్జ్ పై 2 జీబీ 3జీబీ డేటాను, కోసం దాని నెట్వర్క్ లోపల అపరిమిత కాలింగ్ ఆఫర్ అందిస్తోంది. ఇతర నెట్వర్క్లకు 25 నిమిషాల ఫ్రీ కాలింగ్ సదుపాయం, ఆ తర్వాత నిమిషానికి 25 పైసలు వసూలు చేయనుంది.
ప్రతి ఐదు మొబైల్స్లో ఒకటి ఫేక్

అయితే ఢిల్లీ ముంబై మొబైల్ వినియోగదారులకు ప్రస్తుతం ఈ ప్లాన్ అందుబాటులో ఉన్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ 90 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుందని పేర్కొంది.


Click it and Unblock the Notifications








