మరో షాక్..రూపాయికే 300 నిమిషాల 4జీ డాటా కాల్స్..ఎక్కడంటే...?
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేష్ అంబాని రిలయన్స్ జియో ఆపర్ తో మార్కెట్ ని షేక్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు అతని బ్రదర్ రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబాని కూడా రంగంలోకి దిగారు. అదీగాక ఎయిర్ టెల్ కూడా వినియోగదారుల కోసం భారీ ఆఫర్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా వాటిన్నింటికీ ధీటుగా ఇప్పుడు సరికొత్త ఆఫర్ ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. రూపాయికే రూపాయికే 300 నిమిషాల 4జీ డాటాను దేశరాజధానిలో ప్రవేశపెట్టింది.
పేటీఎంకు షాకిచ్చిన ఫ్లిప్కార్ట్..ఇక భారీ డిస్కౌంట్లే

ఢిల్లీలోని వినియోగదారుల కోసం...
రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబాని ఢిల్లీలోని వినియోగదారుల కోసం రూపాయికే 300 నిమిషాల 4జీ డాటాను తీసుకొచ్చారు.

కాల్ డ్రాప్ ను అధిగమించే లక్ష్యంతో
కంపెనీ కాల్ డ్రాప్ ను అధిగమించే లక్ష్యంతో 4 జీ యాప్ టు యాప్ కాలింగ్ సౌకర్యాన్ని ప్రకటించింది

30రోజులపాటు
30రోజులపాటు వర్తించేలా ఒక్కరూపాయి కే 300 నిమిషాల 4జీ డాటాకాలింగ్ సదుపాయాన్ని ప్రకటించింది.

Call Drops Se Chutkaara
Call Drops Se Chutkaara పేరుతో ఈ ఆఫర్ ను దేశ రాజధాని ఢిల్లీలోని వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.

భారతలోనే మొదటి ఆఫర్
దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంత(ఎన్సీఆర్) ప్రజలకు ఇది భారతలోనే మొదటి ఆఫర్ అనీ, కాల్ డ్రాప్ సర్వీసులనుంచి విముక్తి లభించేందుకే ఈసౌకర్యమని ఆర్ కాం కన్జ్యూమర్ బిజినెస్ సీఈవో గురుదీప్ సింగ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








