సగంమంది జియో నుంచి బయటకు వస్తున్నారు !
మార్చి 31 తరువాత టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టడంతో జియో వాడుతున్న యూజర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ఓ సర్వే తెలిపింది.
ఉచిత ఆఫర్లతో సంచంలనం రేపిన జియో వినియోగదారులకు పుల్ ఖుషీని అందించింది. వినియోగదారులు సైతం జియో ఉచిత డేటాతో తెగ ఎంజాయ్ చేశారు కూడా. అయితే జియో మార్చి 31 తరువాత టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టడంతో జియో వాడుతున్న యూజర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని ఓ సర్వే తెలిపింది. వీరంతా వేరే నెట్వర్క్కు మారిపోయే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి.
మిజు సంచలనం, 20 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్

ఆరునెలలపాటు ఉచిత డేటా, వాయిస్ సేవలను
దాదాపు ఆరునెలలపాటు ఉచిత డేటా, వాయిస్ సేవలను అనుభవించిన జియో ఖాతాదారులు ఏప్రిల్ నుంచి కొత్త టారిఫ్లు అమలుకానున్న నేపథ్యంలో జియోలో ఉండాలా వద్దా అని ఆలోచిస్తారని తెలుస్తోంది.

డేటా క్వాలిటీ, స్పీడ్పై వేచి సూచే ధోరణి
అలాగే డేటా క్వాలిటీ, స్పీడ్పై వేచి సూచే ధోరణిని అవలంబించనున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్పీడ్ అదే స్థాయిలో ఉంటే కంటిన్యూ అవ్వడం లేకుంటే పక్కనపడేయడం అనే ఆలోచనలో చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది.

కలకత్తాలో కొంతమందిపై ప్రయోగాలు
కలకత్తాలో కొంతమందిపై ప్రయోగాలు జరపగా వారు సెకండరీ కింద జియో సిమ్ వాడుతున్నామని జియో సేవలు ఏప్రిల్ తరువాత బాగుంటే కంటిన్యూ అవుతామని తెలిపారు. మార్కెట్లో పోటీదారులతో పోలిస్తే జియో ధరలు బావుంటే కొనసాగుతామని, లేదంటే వేరే నెట్వర్క్కు మళ్లీ తరలిపోనున్నట్టు చెప్పారు.

ప్రైమ్ మెంబర్ షిప్ స్కీం, కొత్త టారిఫ్ లను
కాగా వెల్ కం ఆఫర్ తో సంచలనంగా దూసుకొచ్చిన జియో హ్యాఫీ న్యూ ఇయర్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఇది మార్చి 31తో ముగియనుండడంతో ప్రైమ్ మెంబర్ షిప్ స్కీం, కొత్త టారిఫ్ లను ప్రకటించింది.

నెలకి మరో 303 రూపాయలు
ప్రైమ్ మెంబర్లుగా మారాలంటే ముందు రూ.99 చెల్లించాలి. ఈ ఫీజు ఏడాది వరకే చెల్లుబాటు అవుతుంది. రిలయన్స్ అధినేత ముకేష అంబానీ ప్రకటించిన దాని ప్రకారం ఇలా మెంబర్లుగా మారిన తర్వాత ఫ్రీ ఆఫర్లు వాడుకోవాలంటే మాత్రం నెలకి మరో 303 రూపాయలు చెల్లించాల్సిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








