మిజు సంచలనం, 20 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్
ఈ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 7 ప్లస్ కన్నా 11 రెట్లు, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ కన్నా 3.6 రెట్లు వేగంగా ఛార్జింగ్ అవుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
కేవలం 20 నిమిషాల్లోనే 100 శాతం ఛార్జింగ్ ఎక్కేలా చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల తయారీ సంస్థ మిజు సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. 'సూపర్ ఎం ఛార్జ్' పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ఫోన్ను వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో కంపెనీ లాంచ్ చేసింది.
పేటీఎమ్ వాడేవారికి కొన్ని టిప్స్

ఈ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 7 ప్లస్ కన్నా 11 రెట్లు, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ కన్నా 3.6 రెట్లు వేగంగా ఛార్జింగ్ అవుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సరికొత్త టెక్నాలజీని వినియోగించి ఈ స్మార్ట్ఫోన్ను తయారు చేసినట్లు చెప్పారు.
జియో కష్టమర్లకు అసలైన షాక్ ఇప్పుడిచ్చింది !

అంతేగాక, ఈ స్మార్ట్ఫోన్ అత్యంత భద్రమైనదని, ఎక్కువ సేపు కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ స్మార్ట్ఫోన్ను ఛార్జ్ చేసే సమయంలో బ్యాటరీ కూడా వేడెక్కదని కంపెనీ చెబుతోంది. ఫీచర్లు ఎలా ఉంటాయనేది ఇంకా బయటకు రాలేదు.


Click it and Unblock the Notifications








