చంద్రయాన్ -3 మిషన్ లాంచ్ ఎప్పుడో తెలుసా?
2020 లో భారత్ చంద్రయాన్ -3 ను విడుదల చేయనున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రధాని కార్యాలయంలో రాష్ట్ర మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ చంద్రయాన్ -3 మిషన్ కు అయ్యే ఖర్చు విషయానికి వస్తే చంద్రయాన్ -2 కంటే తక్కువగా ఉంటుందని ఆయన ప్రత్యేకంగా చెప్పారు.

చంద్రయాన్ -2 ను చంద్రుడి యొక్క దక్షిణదృవం ఉపరితలంపైన దించడంలో భారతదేశం చేసిన తొలి ప్రయత్నం నిరాశ పరిచింది అని చెప్పడం తప్పు మొదటి ప్రయత్నంలో ఏ దేశమూ అలా చేయలేదని అన్నారు.

చంద్రయాన్ -3 యొక్క ల్యాండర్ మరియు రోవర్ మిషన్ 2020 లో జరుగుతుంది. చంద్రయాన్ -2 మిషన్ ద్వారా మనం చాలా నేర్చుకున్నందున దీనిని విఫలమని పిలవలేము. ప్రపంచంలో ఏ దేశం కూడా దాని మొదటి ప్రయత్నంలో చంద్రుడి మీద అడుగుపెట్టలేదు. యుఎస్ కూడా చంద్రుడి మీద అడుగు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేసింది. కాని ఇండియాకు చాలా ప్రయత్నాలు చేయవలసిన అవసరం లేదు అని సింగ్ అన్నారు.

చంద్రయాన్ -2 ప్రయోగంతో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను సేకరించిన అనుభవం ఉన్నందున చంద్రయాన్ -3 కోసం అయ్యే ఖర్చును తగ్గిస్తుందని ఆయన అన్నారు. అయినప్పటికీ చంద్రయాన్ -3 మిషన్ యొక్క ప్రయోగ తేదీని మరియు నెలను ఇంకా వెల్లడించలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2020 సంవత్సరం 2 హాఫ్ లో దీనిని ప్రయోగించే అవకాశం ఎక్కువగా ఉంది.

చంద్రయాన్ -2 మిషన్ చంద్రుని ఉపరితలంపైకి దిగడానికి భారతదేశం చేసిన మొదటి ప్రయత్నం. చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం ఉపరితలంపై ల్యాండింగ్ చేయడానికి విక్రమ్ ల్యాండర్ ద్వారా ఇస్రో ప్లాన్ చేసింది. అయితే విక్రమ్ ల్యాండర్ చివరి నిమిషంలో కమ్యూనికేషన్స్ కోల్పోవడం కారణంగా అది హార్డ్ ల్యాండ్ అయింది. ఒక నెలల తరువాత చంద్రుడి ఉపరితలంపై వున్న విక్రమ్ ల్యాండర్ యొక్క శిథిలాలను నాసా కనుగొన్నది.

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక ప్రతిస్పందనలో సింగ్ మాట్లాడుతూ రోవర్ మరియు ల్యాండర్ యొక్క వేగం 1683 m / s నుండి 146 m / s కు తగ్గించబడింది. రెండవ దశలో దాని వేగం తగ్గించడం కోసం రూపకల్పన చేసిన దాని కంటే ఎక్కువ విలువ ఉండడం కారణంగా బ్రేకింగ్ దశ ప్రారంభంలో ప్రారంభ పరిస్థితులు రూపకల్పన చేసిన పారామితులకు మించినవి. ఫలితంగా విక్రమ్ ల్యాండింగ్ కోసం నియమించబడిన ఎత్తు సైట్ నుండి 500 మీ.


Click it and Unblock the Notifications








