అంతరిక్షంలోకి వెళ్లిన కుక్కలు ఏమయ్యాయి..?
ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఒకప్పుడు అందుబాటులో లేదు. ఒక్కసారి పాత రోజులను గుర్తుచేసుకుంటే మనిషి సాధించిన మైలు రాళ్లు ఒక్కొక్కటిగా మన కళ్ల ముందు మెదులుతాయి.

మీకు తెలుసా..? అంతరిక్షంలోకి మనుషుల కంటే ముందు జంతువులు ప్రయాణం చేసాయి. అంతరిక్షంలో వాతవరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు స్పేస్ ఏజెన్సీలు తొలత జంతువులనే ఎంపిక చేసుకున్నాయి. అంతరిక్షంలో కాలు మోపిన 10 నాన్ - హ్యుమన్ వ్యోమగామల వివరాలను ఇప్పుడు చూద్దాం...
Read More : రూ.1కే LeEco లీ2 ఫోన్, త్వరపడండి

మనుషుల కంటే ముందుకు అంతరిక్షంలో కాలు మోపిన జంతువులు
957 నవంబర్ 3వ తేదీన 1957 నవంబర్ 3వ తేదీన రష్యా ప్రయోగించిన ‘స్సుట్నిక్ 2' (Sputnik 2) ఉపగ్రహంలో లైకా అనే కుక్కను పంపించారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి జంతువు ఇదే. వెనక్కి తిరిగొచ్చే అవకాశం లేకపోవటంతో కొన్ని గంటల వవ్యధిలోనే ఈ కుక్క మరణించింది.

మనుషుల కంటే ముందుకు అంతరిక్షంలో కాలు మోపిన జంతువులు
1961లో హ్యామ్ అనే చింపాంజీని అంతరిక్షంలోకి దిగ్విజయంగా పంపగలిగారు.

మనుషుల కంటే ముందుకు అంతరిక్షంలో కాలు మోపిన జంతువులు
1973లో అనితా, అరాబిల్లా అనే రెండు సాలి పురుగులను స్కైల్యాబ్ 3 స్పేస్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పంపగలిగారు.

మనుషుల కంటే ముందుకు అంతరిక్షంలో కాలు మోపిన జంతువులు
1963 అక్టోబర్ 18న ఫ్రెంచ్ ఫెలిక్స్ అనే పిల్లిని అంతరిక్షంలోకి పంపింది. ఆ తర్వాత అది భూమిపైకి క్షేమంగా తిరిగి వచ్చింది.

మనుషుల కంటే ముందుకు అంతరిక్షంలో కాలు మోపిన జంతువులు
1968లో సోవియట్ యూనియన్ రెండు తాబేళ్లను జాండ్ 5 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపగలిగింది. స్వల్ప్ అస్వస్థత మినహా ఇవి క్షేమంగా భూమికి తిరిగి వచ్చాయి.

మనుషుల కంటే ముందుకు అంతరిక్షంలో కాలు మోపిన జంతువులు
అంతరిక్షంలో లోతైన అధ్యయనం నిమిత్తం 1973లో రెండు చేపలను స్కైల్యాబ్ 3 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించగలిగారు. అనంతరం ఈ చేపలను అనేక అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగించారు.

మనుషుల కంటే ముందుకు అంతరిక్షంలో కాలు మోపిన జంతువులు
1970లో ఆర్బిటింగ్ ఫ్రాగ్ ఓటోలిత్ (ఓఎఫ్ఓ) అనే ప్రోగ్రామ్ పేరుతో నాసా రెండు కప్పలను అంతరిక్షంలో పంపింది. శాస్త్రవేత్తల ప్రోగ్రామ్ విజయవంతమైంది గాని కప్పలు మాత్రం ఎప్పటికి తిరిగిరాలేదు.

మనుషుల కంటే ముందుకు అంతరిక్షంలో కాలు మోపిన జంతువులు
1985లో నిర్వహించిన బయోన్ 7 మిషన్లో భాగంగా రెండు కోతులతో పాటు 10 నీటి ఉడుములను అంతరిక్షంలోకి పంపారు.

మనుషుల కంటే ముందుకు అంతరిక్షంలో కాలు మోపిన జంతువులు
మార్చి 9, 1961లో దివికిఎగసిన సోవియల్ స్పుట్నిక్ 9 స్పేస్క్రాఫ్ట్ వెంట మొదటి గయనా పందిని పంపిచారు. వీటితో పాటు పలు కుక్కలు, సరీసృపాలు ఇంకా ఎలుకలను కూడా స్పేస్లోకి పంపారు.


Click it and Unblock the Notifications








