రూ.9999కే LG కొత్త స్మార్ట్ఫోన్, Qualcomm Snapdragon ప్రాసెసర్తో
LG K8 పేరుతో ఈ ఫోన్ లభ్యమవుతుంది...
దక్షిణ కొరియా బ్రాండ్ LG సైలెంట్గా మరో స్మార్ట్ఫోన్ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ముంబైకు చెందిన ప్రముఖ రిటైలర్ మహేష్ టెలికామ్ వెల్లడించిన వివరాల ప్రకారం LG K8 పేరుతో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుది. ధర రూ.9,999. ఆఫ్లైన్ మార్కెట్లో మాత్రమే ఈ ఫోన్ లభ్యమవుతుంది.

ఎల్జీ కే8 ప్రత్యేకతలు... 5 అంగుళాల హైడెఫినిఫన్ ఇన్-సెల్ టచ్ ఐపీఎస్ డిస్ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 720x 1280 పిక్సల్స్) విత్ 2.5డి గ్లాస్ కోటింగ్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4GHz క్వాడ్ కోర్ క్వాల్కమ్ Snapdragon 425 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,500 mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ, 3జీ, వై-ఫై, బ్లుటూత్, ఎన్ఎఫ్సీ, ఏ-జీపీఎస్, మైక్రోయూఎస్బీ 2.0, ఫోన్ బరువు 144 గ్రాములు, చుట్టుకొలత 144.5 x 72.1 x 8మిల్లీ మీటర్లు.


Click it and Unblock the Notifications








