ఇంటెల్ అతి పెద్ద డీల్
ఇజ్రాయిల్ కంప్యూటర్ కంపెనీ మొబైల్ ఐ కంపెనీ కొనుగోలు, మొబైల్ ఐ ని 15 బిలియన్ డాలర్లకు (దాదాపు లక్షలకోట్ల రూపాయలు) కి సొంతం
అమెరికాకు చెందిన కంప్యూటర్ చిప్ దిగ్గజం ఇంటెల్ కార్పొరేషన్ డ్రైవర్ లెస్ కారును అందుబాటులోకి తెచ్చే యోచనలో భారీ డీల్ కుదుర్చుకుంది. ఇజ్రాయిల్ కంప్యూటర్ కంపెనీ మొబైల్ ఐ కంపెనీని కొనుగోలు చేసింది. డ్రైవర్ లెస్ టెక్నాలజీలో విశేష కృషి చేస్తున్న మొబైల్ ఐ ని 15 బిలియన్ డాలర్లకు (దాదాపు లక్షలకోట్ల రూపాయలు) కి సొంతం చేసుకోనుంది.

ఈ మేరకు ఇరు సంస్థలు సోమవారం ఒక ప్రకటన జారీ చేశాయి. రాబోయే తొమ్మిది నెలల్లో ఈ ఒప్పందం పూర్తికానుందని తెలిపాయి. తమ వాటాదారులకు,ఆటోమోటివ్ పరిశ్రమకు ఇది గొప్పముందడుగు అని ఇంటెల్ సీఈవో బ్రియాన్ క్రజానిచ్ తెలిపారు. డ్రైవింగ్ లెస్ కారు ఆవిష్కరణను వేగవంతం చేయనున్నట్టు చెప్పారు.
1000 జిబి డేటా, 10 జిబిపిఎస్ స్పీడ్, జియో సంచలనం

ఈ ప్రక్రియలో ఇంటెల్ కీలకమైన, పునాది సాంకేతికలను అందిస్తోంటే, మొబైల్ ఐ పరిశ్రమకు ఉత్తమ ఆటోమోటివ్ గ్రేడ్ కంప్యూటర్ విజన్ అందిస్తోంది. దీంతో ఇకముందు తమ భాగస్వామ్యంలో తక్కువ ఖర్చుతో, మెరుగైన ప్రదర్శనతో క్లౌడ్ టు-కారు సొల్యూషన్ తో భవిష్యత్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను మరింత వేగంగా అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.
షాకింగ్ ఫీచర్లతో నోకియా 8, కొత్తవి ఇవే !

ప్రముఖ కార్ల ఉత్పత్తిదారులు, సరఫరాదారులు, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్తో తమ సంబంధాలు యధావిథిగా కొనసాగుతాయని మొబైల్ ఐ ప్రకటించింది. ప్రస్తుత ఉత్పత్తి లో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications








