ప్రతి ఐదు మొబైల్స్లో ఒకటి ఫేక్
మీరు మొబైల్ కాని మరైదైనా కాని కొనుగోలు చేస్తున్నారా..అయితే స్మార్ట్ ఫోన్లు, హెడ్ సెట్లు, ఇతర ఎలక్ట్రిక్ డివైజ్ లు కొనేటప్పుడు వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీఅవుతున్నాయి.
మీరు మొబైల్ కాని మరైదైనా కాని కొనుగోలు చేస్తున్నారా..అయితే స్మార్ట్ ఫోన్లు, హెడ్ సెట్లు, ఇతర ఎలక్ట్రిక్ డివైజ్ లు కొనేటప్పుడు వినియోగదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీఅవుతున్నాయి. ప్రతి ఐదు స్మార్ట్ ఫోన్లలో కనీసం ఒకటి నకిలీదేనని తాజా రిపోర్టుల్లో వెల్లడవుతోంది.
ఇండియాలో షియోమి ఉద్యోగాల పంట, 20వేలకు పైగానే

దీనిపై ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఓఈసీడీ) మంగళవారం ఓ రిపోర్టు విడుదల చేసింది. ఈ రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మార్కెట్లోకి వస్తున్న నకిలీ స్మార్ట్ ఫోన్లు, హెడ్ సెట్లు, ఎలక్ట్రిక్ డివైజ్ లతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఇవి కేవలం తక్కువ నాణ్యతను కలిగి ఉండటమే కాక ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయని ఓఈసీడీ రిపోర్టు హెచ్చరించింది.
మరో షాక్, జియో బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్

మంచి ఫోన్లతో పోలిస్తే నకిలీ ఫోన్లలోనే ఆరోగ్యానికి హానికలుగజేసే సీసం, కాడ్మియంలను ఎక్కువ ఉన్నాయని ఓఈసీడీ రిపోర్టు పేర్కొంది. నకిలీ ఫోన్ల ఛార్జర్లు పేలుళ్లకు, ఎలక్ట్రిక్ షాక్లకు గురవుతాయని రిపోర్టు నివేదించింది.


Click it and Unblock the Notifications








