Airtel అందిస్తున్న అదనపు డేటా యాడ్-ఆన్ ప్లాన్లు....
భారతీ ఎయిర్టెల్ కొన్ని ఎంచుకున్న పోస్ట్పెయిడ్ యాడ్-ఆన్ ప్లాన్ లతో ప్రస్తుత సమయంలో ఇంటి వద్ద నుండి పనిచేస్తున్న వినియోగదారులకు కేవలం రూ.100 లకే 15Gb వరకు డేటాను అందిస్తుంది. ప్రస్తుతం భారతదేశం మొత్తం కోవిడ్ -19 కారణంగా లాక్డౌన్ లో ఉంది. ఈ కష్ట కాలంలో చాలా మంది ఎయిర్టెల్ వినియోగదారులు ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారు.

హోమ్ యాడ్-ఆన్ ప్యాక్ పేరుతో ఎయిర్టెల్ నుండి వచ్చే ప్లాన్ లు ఈ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సూచించినట్లుగా డిసెంబర్ 2019 ముగిసిన కాలానికి భారతదేశంలో కేవలం 19.14 మిలియన్ వైర్లైన్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు మాత్రమే ఉన్నారు. ప్రొఫెషనల్ పనిని నిర్వహించడానికి మొబైల్ డేటాను ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. టెలికాం కంపెనీలు అదనపు డేటాను అందించడానికి అనేక రకాల ప్రీపెయిడ్ యాడ్-ఆన్ ప్యాక్లు లేదా స్వతంత్ర డేటా ప్యాక్లను కూడా అందిస్తున్నాయి. ఎయిర్టెల్ ఇప్పుడు పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న హోమ్ యాడ్-ఆన్ ప్యాక్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ హోమ్ పోస్ట్పెయిడ్ డేటా యాడ్-ఆన్ ప్యాక్
భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం తన పోస్ట్పెయిడ్ వినియోగదారుల కోసం రెండు యాడ్-ఆన్ ప్యాక్లను అందిస్తోంది. బేస్ యాడ్-ఆన్ 15GB డేటాను రూ.100 ధర వద్ద అందిస్తున్నది. అదనంగా కంపెనీ 35GB డేటాను రూ.200 ధర గల మరొక యాడ్-ఆన్ ప్యాక్ ద్వారా అందిస్తుంది. ఎయిర్టెల్ యొక్క పోస్ట్పెయిడ్ యాడ్-ఆన్లు మొదట్లో జనవరిలో ఆవిష్కరించబడ్డాయి. ఏదేమైనా సంస్థ ఇప్పుడు తన 15GB యాడ్-ఆన్ ప్యాక్ను "ఇంటి నుండి సులభంగా పని" ట్యాగ్ కింద ప్రచారం చేస్తోంది. ఆసక్తిగల వినియోగదారులు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ నుండి ఈ డేటా ప్యాక్లకు సభ్యత్వాన్ని పొందవచ్చని కంపెనీ తెలిపింది.

ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ ప్లాన్లు
ఎయిర్టెల్ యొక్క పోస్ట్పెయిడ్ ప్లాన్ లు ఆంధ్రప్రదేశ్, డీల్లీ / ఎన్సిఆర్ రీజియన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో 349 రూపాయలతో ప్రారంభమవుతాయి. ఇతర రాష్ట్రాల్లో ఎయిర్టెల్ యొక్క ప్లాన్లు రూ.399 వద్ద అందిస్తుంది. ఎయిర్టెల్ యొక్క రూ.349 ప్లాన్లో 5GB రోల్ఓవర్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు వంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఎయిర్టెల్ తన రూ.349 ప్లాన్ చందాదారులకు Zee5, ఎయిర్టెల్ టివి ప్రీమియంను అదనంగా కూడా అందిస్తుంది. ఎయిర్టెల్ యొక్క రూ.399 ప్లాన్లో 40GB రోల్ఓవర్ డేటాతో పాటు రూ.349 ప్యాక్తో సమానమైన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తుండగా హ్యాండ్సెట్ ప్రొటెక్షన్ కూడా అదనంగా అందిస్తుంది.

జమ్మూ కాశ్మీర్లో ఎయిర్టెల్ ప్రస్తుతం రూ .249 ప్లాన్ను అందిస్తోంది. ఇది వినియోగదారులకు 25GB రోల్ఓవర్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్లతో పాటు వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ను అందిస్తుంది.

ఎయిర్టెల్ ప్రీమియం పోస్ట్పెయిడ్ ప్లాన్లు
ఎయిర్టెల్ యొక్క ప్రీమియం పోస్ట్పెయిడ్ ప్లాన్లు రూ.499 నుండి ప్రారంభమవుతాయి. ఇది వినియోగదారులకు 75GB రోల్ఓవర్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలతో పాటు అమెజాన్ ప్రైమ్, Zee5 మరియు ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్లకు సభ్యత్వాన్ని అందిస్తుంది. ఎయిర్టెల్ తన ప్రీమియం పోస్ట్పెయిడ్ ప్లాన్లలో హ్యాండ్సెట్ ప్రొటెక్షన్ కూడా అందిస్తున్నది.

ఎయిర్టెల్ మరికొన్ని పోస్ట్పెయిడ్ ప్లాన్లు
భారతి ఎయిర్టెల్ రూ.749, రూ.999 మరియు రూ .1599 ధర వద్ద మరికొన్ని పోస్ట్ పైడ్ ప్యాక్లను అందిస్తుంది. ఇవి ఎక్కువగా అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్లతో సహా ఇలాంటి ప్రయోజనాలను అందిస్తాయి. రూ .799 ప్యాక్ 125 జీబీ రోల్ఓవర్ డేటాను అందించగా, రూ.999 ప్యాక్ 150 జీబీ రోల్ ఓవర్ డేటాను అందిస్తుంది. టాప్ టైర్డ్ రూ. 1599 ప్యాక్ యూజర్లు 200 ISD నిమిషాలతో పాటు అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్లపై 10% డిస్కౌంట్తో పాటు అపరిమిత డేటాను బ్రౌజ్ చేయడానికి అనుమతిస్తుంది.


Click it and Unblock the Notifications








