గూగుల్ క్రోమ్కి పోటీగా మైక్రోసాప్ట్ నుంచి కొత్త ఓఎస్
గూగుల్ క్రోమ్ మార్కెట్లో దూసుకుపోతున్న నేపథ్యంలో దానికి పోటీగా సరికొత్త ఓఎస్ ని లాంచ్ చేయాలని మైక్రోసాఫ్ట్ అనుకుంటోంది.
గూగుల్ క్రోమ్ మార్కెట్లో దూసుకుపోతున్న నేపథ్యంలో దానికి పోటీగా సరికొత్త ఓఎస్ ని లాంచ్ చేయాలని మైక్రోసాఫ్ట్ అనుకుంటోంది. ఇప్పటికే విండోస్తో డెస్క్టాప్ ప్రపంచాన్ని ఏలుతున్న మైక్రోసాఫ్ట్ విండోస్ క్లౌడ్ పేరుతో ఈ కొత్త ఓఎస్ ని తీసుకురానుంది. ఇప్పుడిప్పుడే మార్కెట్లో పుంజుకొంటున్న గూగుల్ 'క్రోమ్' ఓఎస్కు పోటీగా విండోస్లో ఈ కొత్త వెర్షన్ను రూపొందిస్తోందట మైక్రోసాఫ్ట్.
రూ. 7 వేలకు అదిరే 4జీ వోల్ట్ ఫోన్

క్రోమ్ ఓఎస్ వినియోగదారులు తమ ఫైళ్లను క్లౌడ్లోనే స్టోర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ కొత్త ఓఎస్లో విండోస్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న యాప్లు మాత్రమే పనిచేస్తాయట. ప్రస్తుతం క్రోమ్ ఓఎస్లోనూ అదే పరిస్థితి.
మీ ఫోన్కి సిగ్నల్ సరిగా అందడం లేదా..?

ఇప్పటి వరకు క్రోమ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్లను మాత్రమే వినియోగించుకునే వీలుండేది. ఇక నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యాప్లను డౌన్లోడ్ చేసుకుని వాడుకునే వెసులుబాటు ఉంటుందని ఇటీవలే గూగుల్ ప్రకటించింది.
బ్లాక్బెర్రీ నుంచి తొలిసారిగా డ్యూయెల్ సిమ్ ఫోన్

ఈ నేపథ్యంలో కొత్త ఓఎస్ను మైక్రోసాఫ్ట్ ఈ ఏడాదే మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








